వైరల్ అవుతున్న పాయల్ లేటెస్ట్ పిక్..!

  • February 18, 2019 / 05:42 PM IST

గతేడాది విడుదలైన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది పాయల్ రాజపుత్. ఈ చిత్రంలో తన నటనతో పాటూ… తన అందంతో కూడా కుర్రకారుని హీటెక్కించింది. ‘లిప్ లాక్స్’ ఓ రేంజ్లో రెచ్చిపోయింది ఈ హర్యానా భామ. ఈ చిత్రంతో.. పాయల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రవితేజ సరసన ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటూ నాగార్జున ‘మన్మధుడు 2’ లో కూడా ఓ హీరోయిన్ నటించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు ‘వెంకీమామ’ చిత్రంలో కూడా వెంకటేష్ సరసన జతకట్టబోతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ప్రైవేట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ ‘మిస్సా మోర్’ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్ గా పని చేస్తుంది. ఇందులో భాగంగా ఈ బ్రాండ్ కి సంబందించిన దుస్తులను ధరించి ఫోటో షూట్ చేసింది.. తాజాగా ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది. అందమైన మెరూన్ కలర్ టాప్.. జీన్స్ స్కర్ట్ తో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus