అనారోగ్యం పాలైనా… ‘సాహో’ డైరెక్టర్ తగ్గట్లేదుగా..!

  • September 7, 2019 / 07:41 PM IST

‘సాహో’ విడుదలైనప్పటి నుండీ ఆ చిత్ర దర్శకుడు, హీరో, దర్శకుడు ఎవరూ కనిపించలేదు. నెగిటివ్ టాక్ వలనే దర్శకుడు సుజిత్ గోవా కి వెళ్లిపోయాడని కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఆయన గోవాలో లేడంట… హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడట. విషయంలోకి వెళితే… సుజిత్ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడట. నిజానికి ‘సాహో’ విడుదలకు ముందు నుండే జ్వరంతో బాధపడుతున్నా పనిలో పడి సుజీత్ పెద్దగా పట్టించుకోలేదట.

ప్రస్తుతం సుజీత్ రక్తంలో ‘ప్లేట్ లెట్స్ కౌంట్’ బాగా తగ్గిపోయిందట. దీనితో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. ఆమె తల్లి దగ్గరుండి సుజీత్ ను చూసుకుంటుందట. ‘సాహో’ విడుదలైన రోజునుండీ సుజిత్ పై మాటల దాడి చేస్తూ వస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో ఆయన మానసికంగా షాక్ కి గురయ్యాడట. అయితే ఇప్పటి పరిస్థితి పర్వాలేదట. ఆయనకీ బాలీవుడ్ నుండీ కొంతమంది హీరోలు ఫోన్ చేసి అభినందించడంతో పాటు.. అవకాశాలు కూడా ఇస్తున్నారట. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కూడా ఉన్నాడట. దీంతో హాస్పిటల్ లోనే ఓ కథని సిద్ధం చేసుకుంటున్నాడట. ఏమైనా ఈ కుర్ర డైరెక్టర్ పట్టుదలని మెచ్చుకోవాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus