ఆ హీరోయిన్స్ విషయంలో కాంప్రమైజ్ అయిన హీరో సాయి ధరమ్ తేజ్

  • November 6, 2018 / 09:25 PM IST

మెగా కాంపౌండ్ నుండి వచ్చి కెరియర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ సాధించి క్రేజ్ తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి నుండి కూడా కొంచం పేరున్న ముద్దగుమ్మలతోనే సినిమాలు చేసిన సాయి ధరమ్ తేజ్ కి లాస్ట్ తీసిన 6 సినిమాలు కూడా వరుసగా నిరాశనే మిగిల్చాయి. ఆ ఆరు సినిమాల కారణంగా కెరియర్ పరంగా కాస్తా వెనక్కి తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ‘చిత్రలహరి’ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో హీరో సాయిధరమ్ తేజ్ కాంప్రమైజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో హీరోయిన్లుగా ‘హలొ’ ఫేమ్ ప్రియదర్శన్ ని, మరొక హీరోయిన్ గా ‘మెంటల్ మదిలో’ ఫేమ్ నివేధా పేతురాజ్‌ ని ఫిక్స్ చేసారు. చిత్రలహరి అంటే చిత్ర, లహరి అనే ఇద్దరి అమ్మాయిల చుట్టూ కథ ఉంటుందని సమాచారం. మరి ఎప్పటినుండో సరైన సక్సెస్ కోసం చూస్తున్న హీరో సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఇక ‘చిత్రలహరి’ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus