Sai Dharam Tej: బ్రో సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్!

  • August 1, 2023 / 08:10 PM IST

సముద్ర కని దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది.ఇలా సాయి ధరంతేజ్ ప్రమాదం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇక ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.సముద్ర కని గురించి మాట్లాడుతూ ఈయన నటుడిగా కొనసాగుతూ పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్టర్గా మారే స్థాయికి ఎదిగారు ఈయన తన జీవితంలో ఇంకా సక్సెస్ కావాలని కోరుకున్నారు.

బ్రో వంటి ఒక గొప్ప సినిమాలో భాగం కావడానికి కారణం త్రివిక్రమ్ గారు ఆయన కారణంగానే పవన్ కళ్యాణ్ మామయ్యతో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని అందుకు త్రివిక్రమ్ గారికి అలాగే పీపుల్ మీడియా జీ స్టూడియోస్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను జీ స్టూడియోలో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని గుర్తు చేసుకున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఈ సినిమాకు తాను సరిపోనని తనని తొలగించాలని చూశారు. కాకపోతే త్రివిక్రమ్ గారు మాత్రం నాపై నమ్మకంతో కొద్దిరోజుల పాటు వేచి ఉండాలని సముద్రఖని గారికి చెప్పి ఒప్పించారంటూ ఈయన మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి వంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అంటూ ఈ సందర్భంగా సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) బ్రో సినిమా సక్సెస్ ఈవెంట్లో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus