కోటి ఇచ్చిన వద్దంటున్న ఫిదా బ్యూటీ సాయి పల్లవి!

  • July 29, 2017 / 12:58 PM IST

ప్రేమమ్(మలయాళం) సినిమా ద్వారా మలయాళ నటి సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఫిదా మూవీ చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. సాయి పల్లవి మాత్రం సెలెక్టెడ్ కథలనే ఎంచుకుంటోంది.  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎంసిఎ  సినిమాకి సైన్ చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మితమవుతున్న ఈ మూవీలో నాని కి జోడీగా సాయి పల్లవి నటించనుంది.

యువ హీరో నాగ్ శౌర్య సరసన నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొంతమంది నిర్మాతలు తమ సినిమాలో నటింపజేయించడానికి ప్రయత్నించారు. కానీ సాయి పల్లవి నటించనని చెప్పిందంట. కోటీ ఇస్తానని ఆశచూపినా.. కథ నచ్చకుండా ఏ చిత్రం చేయనని స్పష్టం చేసిందని సమాచారం. ఈ విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. క్రేజ్ లో ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసుకొని డబ్బులు వెనక్కి వేసుకోకుండా.. ఇలా చేస్తుందేంటి? అని సాయి పల్లవి గురించి కొందరు మాట్లాడుకుంటున్నారు. అవేమి పట్టించుకోకుండా మంచి పాత్రలనే చేయడానికి ఫిక్స్ అయిన సాయి పల్లవిని అభినందించాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus