భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నో చెప్పిన సాయిపల్లవి

  • August 8, 2018 / 10:40 AM IST

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్టార్ హీరో, భారీ రెమ్యునరేషన్, అనే సంగతులను పక్కన పెట్టి మంచి పాత్రలకు మాత్రమే విలువ ఇస్తుంది. కాసేపు అందాలు ఆరబోసి బోలెడు పారితోషికం అందుకోవడం ఆమెకు అసలు ఇష్టముండదు. అది నిజమని తాజా సంఘటన మరోమారు స్పష్టం చేసింది. “ప్రేమమ్(మలయాళం)” సినిమా ద్వారా సాయి పల్లవి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఫిదా మూవీ చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది.

విభిన్నమైన కథతో చేసిన ద్వి భాష చిత్రం “క‌ణం”లో నాలుగేళ్ల పాప‌కి త‌ల్లిగా సాయిప‌ల్ల‌వి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “పడి పడి లేచే మనసు” సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటిస్తోంది. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మళ్ళీ నటించడానికి ఓకే చెప్పింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే ఓ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా చేయమని సాయి పల్లవిని సంప్రదిస్తే.. ఆమె నో చెప్పిందంట. కథలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ ని సైతం వదులుకుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus