విక్రమ్ కుమారుడితో సాయి పల్లవి లవ్

  • August 8, 2018 / 01:58 PM IST

ధృవ్.. ఈ పేరు ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అంతలా వినిపించడానికి కారణం విక్రమ్. తన విలక్షణ నటనతో తెలుగు, తమిళ సినీ ప్రియులను ఆకట్టుకున్న విక్రమ్ తనయుడే ధృవ్. తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన సినిమా అర్జున్ రెడ్డి కథతో వెండితెరపై రాబోతున్నారు. దాదాపు ఆర్నెళ్లుగా ధృవ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డి మేకోవ‌ర్ సాధించాడు. ధృవ్ కొత్త లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్కడ నుంచే అతనిపై చర్చ మొదలయింది.

బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ధృవ్ మరో అవకాశాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. కమ్ముల సొంతంగా నిర్మించనున్న మూవీలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ఒకే అయింది. ఈమె గతంలో ప్రేమమ్, ఫిదా, ఎంసీఏ సినిమాలతో అలరించింది. ప్రేమకథల్లో మెప్పించింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్న మూవీ కూడా ఓ లవ్ స్టోరీ అని తెలిసింది. ఇందులో ధృవ్ ప్రేమలో సాయి పల్లవి పడిపోతుందని సమాచారం. వీరిద్దరి మధ్య ఉండే ప్రేమ సన్నివేశాలు యువతని ఆకట్టుకునేలా కమ్ముల రాసుకున్నట్టు టాక్. సినిమా ప్రారంభానికి ముందే హాట్ టాపిక్ అయిన మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus