మధురవాణి పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

  • April 18, 2018 / 09:31 AM IST

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మహానటి’లో సమంత ‘మధురవాణి’ అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు వంటి వారందరూ నటిస్తున్న ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిశ్చయించుకొన్న విషయం తెలిసిందే. అయితే.. సమంత కేవలం రెండ్రోజుల్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసింది. “మహానటి”లో సమంత స్వంత డబ్బింగ్ ఏమాత్రం క్లిక్ అయినా ఇప్పటివరకు సమంతకు డబ్బించ్ చెబుతున్న చిన్మయికి అవకాశాలు తగ్గినట్లే.

ఇకపోతే.. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం తెలుగు సినిమా అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సావిత్రి నటించిన్ ఆనాటి మేటి సన్నివేశాలను “మహానటి”లో రీక్రియేట్ చేశారట. ముఖ్యంగా సినిమాలోని సెట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయమని, ఇక సావిత్రిగా కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడం ఖాయమని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus