‘కేజీఎఫ్’ సీక్వెల్ కు మరింత క్రేజ్ పెరగడం ఖాయం..!

  • January 12, 2019 / 07:25 AM IST

కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మాస్ కి సరికొత్త అర్ధం చెప్పింది. ఈ చిత్రంలో డైరెక్టర్.. హీరో యశ్ ను ఎలివేట్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యం తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం.. భారీ కలెక్షన్లను రాబట్టింది. హిందీలో బాలీవుడ్ బాద్ షా అయిన షారుఖ్ ఖాన్ ‘జీరో’ చిత్రం ఉన్నప్పటికీ ‘కేజీఎఫ్’ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించింది. ఇక తెలుగులో కూడా ‘అంతరిక్షం’ ‘పడి పడి లేచె మనసు’ వంటి క్రేజీ చిత్రాలు ఉన్నప్పటికీ ‘కేజీఎఫ్’ చిత్రం మాత్రమే మంచి కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక తాజా సమాచారం ప్రకారం ‘కేజీఎఫ్’ కు సీక్వెల్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతుందట. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా జరిగిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సీక్వెల్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అలాగే రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ వార్త బయటకి రావడంతో ఈ చిత్రం పై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సీక్వెల్ కు భారీ డిమాండ్ ఉందనడంలో సందేహం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus