ప్రభాస్ హీరోయిన్ ఇంత పని చేసిందేంటి..?

  • December 30, 2019 / 12:52 PM IST

ప్రభాస్, త్రిష జంటగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది సంజనా గల్‌రాణి. ఆ చిత్రంలో త్రిష చెల్లిగా నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ లో కూడా కీలక పాత్ర పోషించినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో కన్నడ, బాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఓ నిర్మాత పై దాడి చేసిన సంఘటన పెద్ద సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా దక్షిణాది హీరోయిన్ సంజనా గల్‌రాణి .. బాలీవుడ్ నిర్మాత అయిన వందనా జైన్‌ తో గొడవ పడుతూ వస్తోంది. అయితే డిసెంబర్ 22న ఆ గొడవ మరింత పెద్దదైంది.

రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో కలిసిన వీరిద్దరో గొడవ పడ్డారట. ఈ క్రమంలో సంజనా మద్యం బాటిల్‌ను వందనా జైన్‌ పై విసిరి కొట్టిందట. దీంతో.. కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్‌లో వందనా.. సంజనా పై కేసు ఫైల్ చేసిందట. ఈ క్రమంలో కొందరు సినీ ప్రముఖులు వీరి మధ్య సంధి చేసే ప్రయత్నం చేయడంతో కాస్త సర్దుమణిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం పై స్పందించిన నిర్మాత వందనా… ‘మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందనేది నిజం. మేము పాత స్నేహితులమే.. అందుకే గొడవను రాజీ చేసుకున్నాము. కథ చర్చించుకుంటున్న విషయంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో ఈ గొడవ చోటుచేసుకుంది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. సంజనా మాత్రం వందనా పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. “వందనా దగ్గర దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉంది, ఈ విషయం పై ఆమెను అధికారులు ప్రశ్నించాలి. ఇల్లీగల్ గా ఆమె డబ్బును సంపాదిస్తోంది.. అసలు వందనా వద్ద అన్ని కోట్లు ఎలా ఉన్నాయో.. విచారణ జరపండి” అంటూ కోరింది సంజనా.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus