Sankalp Reddy: ఘాజి దర్శకుడు ఇంకా అక్కడే..

  • January 15, 2022 / 01:45 PM IST

ఘాజి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళ్ హిందీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఒక విధంగా రానా కారణంగా ఆ సినిమా సక్సెస్ అయ్యింది అనే టాక్ సంకల్ప్ రెడ్డిని లైమ్ లైట్ లోకి తేలకపోయింది. ఒక చిన్న సినిమాగా తెరకెక్కించాలని అనుకున్న సంకల్ప్ కు రానా చాలా హెల్ప్ అయ్యాడు. ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని అతనికి చాలా బాగా సపోర్ట్ చేశాడు.

మిగతా భాషల్లో కూడా సినిమాను క్లిక్ అయ్యేలా చేశాడు. అయితే సంకల్ప్ రెడ్డి రెండవ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మెగా వరుణ్ తేజ్ తో చేసిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ విడుదల కంటే ముందు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఘాజి దర్శకుడు అనగానే తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపించారు. కానీ సినిమా మాత్రం ఆశించినంత ఆసక్తికరంగా ఏమి అనిపించలేదు.

ఇక ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు రావడంతో సంకల్ప్ మరో అవకాశం అందుకేకపోయాడు. ఆ మధ్య పిట్ట కథలు వెబ్ సీరీస్ కు ఒక వెర్షన్ కు డైరెక్షన్ చేశాడు. ఇక ఆ తరువాత అతనికి బాలీవుడ్ ఒక ఆఫర్ రావడంతో గత ఏడాది నుంచి అక్కడే చర్చలు కొనసాగిస్తున్నాడు. ఇక బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ‘ఐబీ 71’ అనే హిందీ సినిమాను స్టార్ట్ చేశాడు సంకల్ప్ రెడ్డి. విద్యుత్ జమ్వాల్ సొంత ప్రొడక్షన్ లోనే ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఎలాగైనా ఈ సినిమాతో సంకల్ప్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసే ఐబి అధికారుల జీవితాన్ని ఈ సినిమాలో చూపిస్తారట. ఒక సీరియస్ ఐబీ అధికారిగా విద్యుత్ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus