రికార్డు స్థాయిలో ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ రైట్స్ !

  • June 24, 2019 / 06:24 PM IST

‘మహర్షి’ చిత్రంతో హిట్టందుకుని మంచి జోష్ లో ఉన్నాడు మహేష్. ఈ చిత్రంతో మొదటిసారి 100 కోట్ల షేర్ ను రాబట్టాడు. ఇది మహేష్ కు 25 వ చిత్రం. ఇక తరువాత తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.. కానీ అప్పుడే ఈ చిత్రం బిజినెస్ మొదలైపోయింది. మహేష్ స్టామినా ఏంటో మరోసారి ఈ చిత్రంతో ఋజువయ్యింది.

‘సరిలేరు నీకెవ్వరు’ డిజిటల్ శాటిలైట్ హక్కల్ని ‘జెమిని టీవీ’ భారీ రేట్ కు దక్కించుకుందట. ‘మహర్షి’ చిత్రాన్ని ఏకంగా 16.8కోట్లకు దక్కించుకోగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని జెమిని టివి వారు దక్కించుకున్నారట. జులై 5 నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. దిల్ రాజు – రామబ్రహ్మం సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus