సంక్రాంతికి ఆశీస్సులు కావాల్సిందే అంటున్న దిల్ రాజు

  • November 14, 2016 / 10:39 AM IST

అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ప్రస్తుతం ‘నేను లోకల్’, ‘శతమానం భవతి’, ‘ఫిదా’, ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘ఫిదా’ మినహా దాదాపు అన్ని సినిమాల విడుదలకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది. వరుణ్ తేజ్ కోలుకొని ‘మిస్టర్’ షూట్ పూర్తి చేసి వస్తేగానీ ఈ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శతమానం భవతి’ సంక్రాంతి సినిమాగా రావడం అనుమానమే అని ఇటీవల పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ‘శతమానం భవతి’ సినిమా తాత-మనవడి అనుబంధాల మధ్య రూపొందుతున్నట్టు టీజర్ ద్వారా తెలియజెప్పారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంతకాలంగా అమలాపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటికే మెజారిటీ చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28తో మొత్తం షూటింగ్ పూర్తికానుంది. చిరంజీవి ‘ఖైదీ నెం 150’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు సంక్రాతి బరిలో నిలవడంతో ‘శతమానం..’ వాయిదా పడుతుందన్న దానికి బదులుగా “2017 సంక్రాంతికి విడుదల” అంటూ నిర్మాత స్పష్టం చేశారు. అలా ప్రేక్షకుల ఆశీస్సులు తనకూ కావాలంటూ చెప్పకనే చెప్పారు దిల్ రాజు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus