‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ (Kuberaa) అంటూ ఆ మధ్య సినిమా టీజర్ను రిలీజ్ చేసింది టీమ్. అందులోనే సినిమా లైన్ను దాదాపు చెప్పేశారు. సినిమా ట్రైలర్ వచ్చాక ఇంకాస్త క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ ప్రశ్న కథ మెయిన్ లైన్ కాదు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) గురించి, ఆయన సినిమాల నడవడిక గురించి తెలిసినవాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు. ఎందుకంటే చిన్న లైన్లో తన స్క్రీన్ప్లే మాయాజాలంతో వేరే స్థాయిలోకి తీసుకెళ్తారు ఆయన.
గతంలో చాలా సినిమాలకు ఈ పని చేశారు. ఈ సినిమా కోసం రెండేళ్లు స్క్రీన్ప్లే మీద కూర్చున్నారు కూడా.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ కథను రెండు పదాల్లో చెప్పేశారు. ఆయన ఏదో ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడికి, పేదవాడికి మధ్య జరిగే పోరాటాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అని అనిపించిందట.
ఇది చాలా పెద్ద పాయింట్.. కథగా చెప్పడం కష్టమని అనిపించిందట. దీంతో జాగ్రత్తగా రాసుకుని సినిమాగా చేశారు. ఈ సినిమా కథను ఒక్క మాటలో చెప్పాలంటే ‘బిలియనీర్ వర్సెస్ బెగ్గర్’ అని క్లియర్ చేశారు.మరి ఈ సినిమా విషయంలో మీ మార్కు కనిపిస్తుందా? అంటే.. నేనెప్పుడూ సినిమాల్లో నా మార్క్ చూపించాలని అనుకోను అని అన్నారు. తాను రాసుకున్న కథకు ఎలా తెరకెక్కిస్తే బాగుంటుంది అని మాత్రమే ఆలోచిస్తా అని చెప్పారు.
అలాగే ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా కొన్ని కనిపిస్తాయన్నారు. ఈ సినిమా చూశాక ధనుష్ (Dhanush) మాత్రమే ఇలాంటి పాత్ర చేయగలరని అందరికీ అనిపిస్తుంది అని అంటున్నారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). నాగార్జున (Nagarjuna) పాత్ర కొత్తగా ఉంటుందని, కథ రాసుకునేటప్పుడే ఆ పాత్రకు నాగ్ (Nagarjuna) అయితే బాగుంటుందని అనుకున్నారట శేఖర్ కమ్ముల (Sekhar Kammula).ఈ సినిమా సంగేతేంటో తేలాలంటే మరో 24 గంటలు ఆగితేసరి. ధనుష్ (Dhanush), రష్మిక మందన (Rashmika Mandanna), నాగార్జున నటించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.