ఒకప్పటితో పోలిస్తే టాలీవుడ్లో కమెడియన్ల కొరత ఏర్పడింది. బ్రహ్మానందం (Brahmanandam), బాబు మోహన్ (Babu Mohan), అలీ (Ali), మల్లికార్జున రావు (Mallikarjuna Rao), ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam), ఎం.ఎస్.నారాయణ (M S Narayana).. వంటి స్టార్ కమెడియన్స్ రేంజ్లో రాణిస్తున్న కమెడియన్స్ ఇప్పుడు ఎక్కువగా లేరు. ఇప్పుడు వెన్నెల కిషోర్ (Vennela Kishore), సత్య (Satya) వంటి వారు మాత్రమే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు.
సప్తగిరి (Sapthagiri), షకలక శంకర్ (Shakalaka Shankar) వంటి కమెడియన్లు హీరోలవుదామనే మోజుతో డౌన్ అయ్యారు. ఆ తర్వాత ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా అదే బాట పడ్డారు. ఇప్పుడు కాస్తో కూస్తో టాప్ ఆర్డర్లో కనిపిస్తున్న కమెడియన్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఒకరు రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) ఇంకొకరు ప్రసాద్ బెహరా (Prasad Behara), విష్ణు ఓయ్ (Vishnu Oi) వంటి వారు మాత్రమే ఉన్నారు. గెటప్ శీను (Getup Srinu), హైపర్ ఆది (Hyper Aadi) అంతకు అంతే..!
ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద దర్శకులంతా ఇతన్ని దృష్టిలో పెట్టుకుని మంచి పాత్రలు రాసుకుంటున్నారు. కానీ ఒక్కటే సమస్య. అది అతని పారితోషికం. అవును ఇప్పుడు రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) ఒక్కో సినిమాకి రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నారట. అతని టీంని సినిమా యూనిట్లు కన్సల్ట్ చేస్తే.. ఈ లెక్కలే చెబుతున్నారట.
అంటే 25 రోజులు కాల్షీట్స్ కావాలంటే.. రూ.50 లక్షలకి పైనే అతనికి చెల్లించాలి. దీంతో ఓ సెకండ్ ఆర్డర్ కమెడియన్ కి అంత మొత్తం చెల్లించాలా? అంటూ నిర్మాణ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. ఈ విషయాన్ని తొందరగా గుర్తించి రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) కొంత తగ్గితే బెటర్ అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.