ఈ మధ్య సినీ పరిశ్రమలో ఎక్కువగా బ్యాడ్ న్యూస్..లు వినిపిస్తూనే ఉన్నాయి. నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. లేదు అంటే వారి కుటుంబానికి చెందిన వారు మరణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ (Sundeep Kishan) కుటుంబంలో విషాదం నెలకొంది. అతని నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ మరణించారట. ఆమె వయసు 88 ఏళ్ళు అని తెలుస్తుంది. నిన్న అంటే సోమవారం రోజున విశాఖపట్నంలో ఆమె కన్నుమూసినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతోనూ ఈమె బాధపడుతున్నారట. అయితే ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఈ విషయంపై సందీప్ కిషన్ (Sundeep Kishan) తన ఇన్స్టాగ్రామ్లో… ” మా నానమ్మ గారు నిన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మా తాతయ్య కృష్ణం నాయుడు గారు షిప్ ఆర్కిటెక్ట్ కాగా, మా నానమ్మ ఆగ్నెస్ వైజాగ్లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వారి ప్రేమ, పెళ్లి ఓ సినిమా కథని తలపిస్తాయి. 1960లో మతాంతర వివాహం చేసుకున్నారు.
మా తాతగారు పెళ్లి తర్వాత ఆయన పేరును జోసెఫ్ కృష్ణం నాయుడుగా, నానమ్మ ఆగ్నెస్ లక్ష్మిగా మార్చుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ ప్రేమకథ నా దృష్టిలో చాలా గొప్పది. మిస్ యూ నానమ్మ.. లవ్ యూ” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. సందీప్ (Sundeep Kishan) ఎమోషనల్ పోస్ట్ కి నెటిజన్లు చలించిపోతున్నారు. దీంతో అతనికి ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.