అనసూయను ఓరేంజ్లో ఆడేసుకుంటున్నారుగా…!

  • March 23, 2020 / 01:46 PM IST

హాట్ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ తో తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ప్రోగ్రాం వల్ల సినిమాల్లో కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి. అలా అని ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్లతో సరిపెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలనైతేనే చేస్తుంది. ఒక్క ‘కథనం’ సినిమాని పక్కన పెట్టేస్తే.. దాదాపు ఈమె నటించిన సినిమాలన్నీ హిట్లే..! ఇక సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె గ్లామర్ ఫోటో షూట్లను అందులో అప్లోడ్ చేస్తుంటుంది. ఈమె అభిమానులు వాటికి లైకులు కొడుతున్నప్పటికీ.. మరికొందరు ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే…తాజాగా తెలంగాణ సీ.యం కేసీఆర్ ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన నిబంధనల పై స్పందించింది. ఈ నెల 31 వ‌ర‌కూ రాష్ట్ర‌మంతా లాకౌట్ అని.. ర‌వాణా సంస్థలతో స‌హా న్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్లో మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరాడు. ఈ ట్వీట్‌పై అన‌సూయ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నినేను స‌మ‌ర్థిస్తాను. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే .. నాలా రోజు వారీ ప‌నుల‌కు వెళ్లే వాళ్ల ప‌రిస్థితి ఏంటి? మేము ప‌నుల‌కు వెళ్ల‌కుంటే ఇంటి అద్దె, ప‌వ‌ర్ బిల్లులు, ఈ.ఎం.ఐ.లు, ఇత‌ర ఖ‌ర్చులు ఎలా భ‌రించాలి” అంటూ ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ ను ఉద్దేశించి అనసూయ పై ఓ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు నువ్వు రోజు వారి కూలి గురించి ఆలోచించడం ఏంటి కామెడీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరి అకౌంట్ లను ఆమె బ్లాక్ చేస్తూ వస్తుందట. అలా బ్లాక్ చేసి చేసి చేతులు నొప్పెడుతున్నాయి అని కూడా కూడా ఈమె ట్వీట్లు చేస్తుండడం గమనార్హం.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus