ప్రత్యేక పాట కోసం శ్రియ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • April 24, 2023 / 10:38 AM IST

చిరంజీవి – శ్రియాశరన్‌ లది హిట్‌ కాంబినేషన్‌. ఈ జంట ‘ఠాగూర్‌’ చిత్రంతో కనువిందు చేశారు. 23 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో శ్రియ హీరోయిన్‌గా కాదు. ప్రత్యేక గీతం కోసం. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ . మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రియ చిరుతో ఆడిపాడి అలరించనుందట. ఇందులో ఓ ప్రత్యేకంగా సాగే పాట కోసం శ్రియను సంప్రదించారట.

అందుకు ఆమె అంగీకరించిందని సమాచారం. అయితే ఆ ప్రత్యేక గీతం కోసం భారీగానే డిమాండ్‌ చేస్తోందట. దాదాపు కోటి రూపాయాలు నిర్మాణ సంస్థను డిమాండ్‌ చేసిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పైసా’ వసూల్‌ తర్వాత ఆమెకు సరైన విజయం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పెద్ద హిట్‌ అయినా అమెది అతిథి పాత్ర మాత్రమే! అడపాదడపా సినిమాలు చేసినా అవి అంత మాత్రమే ఆడాయి. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న శ్రియ ఇప్పుడు మళ్లీ బిజీ కావడానికి ప్రయత్నిస్తోంది.

తాజాగా ఉపేంద్ర ‘కబ్జా’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తెలుగులో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా చేస్తోంది. ఈ తరుణంలోనే ఆమెకు ‘భోళా శంకర్‌’ లాంటి భారీ చిత్రంలో ఆఫర్‌ వచ్చిందని టాక్‌. అయితే పాటకు కోటి రూపాయిలు డిమాండ్‌ చేయడం ఇప్పుడు చర్చగా మారింది. ‘పాటకు కోటి రూపాయలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే శ్రియ డాన్స్ కు కోటి తక్కువే అని కొందరు అంటుంటే… ఇంకా శ్రియకు ఇంత డిమాండ్‌ ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఏంటి ఐదు నిమిషాల పాటకు కోటి రూపాయలా? అని కొందరు నోరెళ్లబెడుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయుక. కీర్తిసురేశ్‌ చిరుకి చెల్లెలిగా నటిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హిట్‌ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ ఇది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus