టాలీవుడ్‌ హీరోల గురించి శ్రుతి మనసులో మాట

  • February 18, 2021 / 07:02 PM IST

టాలీవుడ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను గట్టిగానే స్టార్ట్‌ చేసింది శ్రుతి హాసన్‌. ‘క్రాక్‌’తో సంక్రాంతికి హిట్‌ కొట్టిన శ్రుతి.. త్వరలో ‘వకీల్‌సాబ్‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ప్రభాస్‌ ‘సలార్‌’లో ఛాన్స్‌ కొట్టేసింది. ఇంకా మరికొన్ని సినిమాలు వరుసగా ఉన్నాయి. ఈలోగా వెబ్‌ సిరీస్‌లు చేసేసింది. ‘పిట్టకథలు’ త్వరలో టెలీకాస్ట్‌ కానుండగా.. ‘ఆహా’ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేసిందనే వార్తలూ వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన హీరోల గురించి చెప్పుకొచ్చింది శ్రుతి.

‘‘అల్లుఅర్జున్‌కి వృత్తిపట్ల చాలా అంకితభావం ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువే కష్టపడతాడు. ఇక మహేశ్‌బాబు అయితే ఎప్పుడూ ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. ఆయనతో స్క్రీన్‌ పంచుకోవడం నా అదృష్టమనే చెప్పాలి’’ అంటూ వివరించింది శ్రుతి హాసన్‌. రవితేజ గురించి చెబుతూ… ‘‘నాకెంతో ప్రత్యేకమైన వ్యక్తి రవితేజ. నా కెరీర్‌ ఆరంభంలో ‘బలుపు’ కోసం ఆయనతో పని చేశా. ఆ సమయంలో చాలా సపోర్ట్‌ చేశారు. సీనియర్‌ నటుడనే ఫీలింగ్‌ లేకుండా చాలా సౌకర్యవంతంగా అనిపించారు. ఆయనకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అని చెప్పింది శ్రుతి హాసన్‌.

‘పిట్టకథలు’లో ఓ డైరక్టర్‌ అయిన నాగ్‌ అశ్విన్‌ గురించి మాట్లాడుతూ… ‘ఆయన ఎప్పుడూ కూల్‌గా ఉంటాడు. నేను పని చేసిన దర్శకుల్లో బ్యాలెన్స్‌డ్‌ డైరక్టర్‌’’ అంటూ పొగిడేసింది. ఇదంతా శ్రుతిహాసన్‌ ఓ బాలీవుడ్‌ ఇంటర్వ్యూలో చెప్పింది. అదే తెలుగు ఇంటర్వ్యూలో అయితే మిగిలిన హీరోల గురించి మనకు తెలిసేది. పోనీలెండి ఇప్పటికి ఈ ముగ్గురు హీరోల గురించి శ్రుతి ఏమనుకుంటుందో తెలిసింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus