సినీ పరిశ్రమలో ఘోర విషాదం..సింగర్ అనుమానాస్పద మృతి.!

  • February 15, 2024 / 08:07 AM IST

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. గత ఏడాది ఎంత మంది ప్రముఖులు మరణించారో అందరికీ తెలుసు. శరత్ బాబు,కె.విశ్వనాథ్, చంద్రమోహన్, విజయ్ కాంత్ వంటి దిగ్గజాలు 2023 లో ప్రాణాలు విడిచారు. ఇక ఈ ఏడాది అప్పుడే ‘బేబీ’ నిర్మాత తండ్రి మరణించడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై సామి కూడా మరణించారు.

ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకోవడం జరిగింది. ఓ సింగర్ అనుమానాస్పద స్థితిలో మరణించి ఆమె గదిలో శవమై కనిపించింది. ఈ ఘోరమైన సంఘటన హిందీ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.

మల్లికా రాజ్ పుత్ తల్లి ద్వారా ఈ సంగతి తెలిసినట్టు వారు చెప్పుకొచ్చారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో బాడీని పోస్టుమార్టం కోసం పంపారు. ఇక సింగర్ గా కెరీర్ ను ప్రారంభించి మంచి పొజిషన్ కి చేరుకుంది. ఇప్పుడిప్పుడే నటిగా కూడా బిజీ అవుతుంది. ఈ టైంలో ఆమెకు ఇలా జరగడం అందరినీ విషాదంలోకి నెట్టే అంశం. ఆమె వయసు కూడా 35 ఏళ్ళు మాత్రమే కావడం మరింత విషాదకరంగా చెప్పుకోవాలి

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus