కె.టి.ఆర్ కు ఫిర్యాదు చేసిన సునీత..!

  • March 23, 2020 / 03:50 PM IST

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. జనాలను సైతం బయటకు రావొద్దు అంటూ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేసాయి. ఎవరైనా వాటిని తృణీకరించి బయటకి వస్తే పోలీసులు వారికి లాఠీలతో సన్మానం చేస్తున్నారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీ పై కూడా దీని ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఇప్పటికే షూటింగ్ లను నిలిపివేయడంతో అందరి హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ సింగర్ సునీతకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. ఇది సునీత వరకూ వెళ్లడంతో ఆమె షాక్ అయ్యి.. చాలా సీరియస్ అయ్యింది కూడా..!

విషయం ఏమిటంటే.. ” బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. కోవిడ్ 19 భారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె పలువురు రాజకీయ నాయకులతో కలిసి పార్టీలో ఉన్నప్పటి ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. అందులో ఉన్న రాజకీయ నేతల వల్ల ఆ ప్రచారాం మరింత ఎక్కువైంది. అయితే ఆ ఫోటోని మార్ఫింగ్ అని తేలడంతో మరోవైపుకు విషయంమళ్లింది . కనిక మార్ఫింగ్ ఫోటోలో ఉన్నది సునీత అని తేలింది. దీంతో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు ఊపందుకున్నాయి. అందుకే సునీత సీరియస్ అయ్యిందని తెలుస్తుంది.ఈ దుష్ప్రచారానికి కారణమైన వారి పై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె తెలంగాణ డీజీపీతో సహా మంత్రి కేటీఆర్ ను కూడా కోరింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus