సూపర్ స్టార్ ఇంట్లో రాఖీ పండుగ

  • August 19, 2016 / 08:16 AM IST

ప్రపంచంతో పాటు మనం మారడంలో తప్పులేదు.. కానీ మన సంస్కృతి, సంప్రదాయాలను విడవకూడదని చెబుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత. అనుబంధాలు కలకాలం పదిలంగా ఉండేందుకు పండుగలు దోహదం చేస్తుందని ఆమె భావిస్తోంది. అందుకే నిన్న రాఖీ పండుగను ఇంట్లో ప్రేమానురాగాలతో జరిపింది. తమ కొడుకు గౌతమ్, కూతురు సితారలకు రక్షాబంధన్ విశిష్టతను వివరించింది.

ఆమె దగ్గరుండి సితార తో గౌతమ్ కి రాఖీ కట్టించి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకునేలా చేసింది. ఈ వేడుక ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘సితార తన అన్నయ్య గౌతమ్ కు రాఖీ కట్టింది. రక్షా బంధన్ పండగ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. కలకాలం వారి మధ్య ప్రేమాభిమానాలు విలసిల్లేలా చేస్తుంది. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అంటూ ఆమె అభిమానులను విష్ చేసారు. ఈ ఫోటోలకు విశేషంగా స్పందన వస్తోంది. ఎక్కువమంది ఈ ఫోటోలను షేర్ చేశారు. మహేబాబు దంపతులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో అన్ని పండుగలను కలిసి జరుపుకుంటుంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus