జై లవ కుశ కి జరిగిన సంఘటనతో మేల్కొన్న స్పైడర్ టీమ్

  • July 1, 2017 / 02:12 PM IST

స్టార్ హీరోల సినిమాలంటే డైరక్టర్, నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెరకెక్కించడానికి కాదు.. తీసినదాన్ని జాగ్రత్తగా రిలీజ్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. ఎదో మార్గాన లీకుల రాయుళ్లు సినిమాని నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’, ‘బాహుబలి’ సినిమా కూడా లీకుల బారిన పడింది. ఇటీవల ‘దువ్వాడ జగన్నాథమ్‌’ను సినిమా ఏకంగా ఫేస్‌బుక్‌లో పెట్టేశారు. ఎన్టీఆర్ తాజా సినిమా జై లవకుశ  సెట్స్ మీద ఉండగానే లీక్‌ అవడంతో మహేష్‌ జాగత్రపడ్డాడట. మురుగదాస్‌ కాంబినేషన్‌లో తాను చేస్తున్న ‘స్పైడర్‌’ సినిమా టీజర్‌ కొన్ని రోజుల క్రితం విడుదలై  సంచలనం సృష్టించింది.

త్వరలో రెండో టీజర్‌ను విడుదల చేయాలని మహేష్‌ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌ను చెన్నైలో ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ టీజర్‌ లీక్‌ కాకుండా ఉండాలని చిత్ర యూనిట్‌ మహేష్ గట్టిగా చెప్పాడంట. దీంతో డైరక్టర్ ని మినహా ఎవరినీ ఎడిటింగ్‌ రూమ్‌లోనికి రానివ్వడం లేదంట. ఎడిటింగ్‌ రూమ్‌ నుంచి ఫుటేజ్ బయటికి పోకుండా సెక్యూరీటీని పెంచినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus