యూరప్ వెళ్లనున్న మహేష్ బాబు!

  • July 27, 2017 / 03:25 PM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి  రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. ఈ పాటకు శోభి కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లే. ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి  విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ రష్యా, చైనా తదితర దేశాల్లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘దసరా పండుగని పురస్కరించుకొని సెప్టెంబర్ 27 న  స్పైడర్ ని రిలీజ్ చేస్తున్నాం. మహేష్‌, మురుగదాస్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి  మించి ఈ చిత్రం ఉండబోతోంది’’అని చెప్పారు. హరీష్ జయరాజ్ ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటలను కంపోజ్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే ఆడియో రిలీజ్ వేడుక తేదీలను ప్రకటించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus