మాంచి మల్టీస్టారర్ సెట్ చేసుకుంటున్న శ్రీనువైట్ల

  • April 25, 2019 / 06:39 PM IST

వరుస డిజాస్టర్ల తర్వాత “ఢీ” సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించి మళ్ళీ ఫామ్ లోకి రావాలని శ్రీనువైట్ల చేస్తున్న ప్రయత్నం గురించి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మాతగానూ వ్యవహరించనున్న ఈ చిత్రాన్ని ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా ఒక మల్టీస్టారర్ లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు శ్రీనువైట్ల. మంచు విష్ణుతో సమానమైన స్టార్ డమ్ లేదా అతనికంటే పాపులర్ హీరోని ఈ సినిమా కోసం తీసుకోనూన్నాడట. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోస్ కి కథ చెప్పగా ఆశించిన స్థాయి స్పందన రాలేదని.. ఆ సెకండ్ హీరో కోసం ఇంకా వెతుకులాట సాగుతూనే ఉందని సమాచారం.

ఇకపోతే.. “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ తర్వాత వచ్చిన శ్రీనువైట్ల అనవసరంగా పాడు చేసుకొంటున్నాడని.. సింపుల్ గా కామెడీ సినిమాగా తీయాల్సిన చిత్రాన్ని మల్టీస్టారర్ అని అనవసరమైన హల్ చల్ చేస్తున్నాడని గుసగుసలాడుకొంటున్నారు. మరి శ్రీనువైట్ల ఇలాగే కంటిన్యూ అయ్యి ఉన్న ఒకే ఒక్క ప్రొజెక్ట్ ను పాడు చేసుకొంటాడా లేక ఉన్నదాంతో సంతృప్తిపడి ఇప్పటికైనా తన ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ నుంచి బయటపడతాడో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus