Actress: ఆర్థిక ఇబ్బందులు… కోట్ల రూపాయలు ఆఫర్ వచ్చిన తిరస్కరించాను!

కేంద్ర మహిళ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె రాజకీయాలలోకి వచ్చి కేంద్రమంత్రి అవడానికి ముందు నటిగా పలు సినిమాలు బుల్లితెర సీరియల్స్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే స్మృతి ఇరానీ రాజకీయాలలోకి వచ్చేన తరువాత అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సీరియల్స్ లో నటించే సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీరియల్స్ చేసే సమయంలో వచ్చే డబ్బులు తన ఖర్చులకు ఏమాత్రం సరిపోయేవి కాదని తెలిపారు. ఇక పెళ్లయిన తర్వాత 25 లక్షల రూపాయల బ్యాంకు లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేసాము అయితే ప్రతినెలా ఈ ఇంటికి ఈఎంఐ చెల్లించడానికి ఎంతో కష్టపడ్డామని ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు కష్టపడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చి భారీ ఆఫర్ ఇచ్చారని స్మృతి ఇరానీ తెలియజేశారు.

బుల్లితెర నటిగా (Actress) ప్రేక్షకులు నన్ను ఎంతో మంచిగా ఆదరించారు అలాంటి సమయంలో కొందరు వ్యక్తులు తనని ఒక యాడ్ చేయమని సంప్రదించారు. ఆ వ్యక్తులు పాన్ మసాలా యాడ్ గురించి చెబుతూ ఈ యాడ్ చేస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని తెలియజేశారు. అయితే తాను ఈ యాడ్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. నేను ఈ యాడ్ తిరస్కరించడంతో నా స్నేహితులందరూ పిచ్చికాన్ని పట్టిందా నీకు అంటూ మాట్లాడారు

అయితే అప్పటి వరకు నన్ను కుటుంబ సభ్యులుగా ఆదరించినటువంటి ఎంతోమంది ప్రేక్షకులు ఈ యాడ్ నటించిన తర్వాత నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అంతేకాకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాటిని తాను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus