ఆ రెండు టీంలను లేపేసారా?

  • June 24, 2020 / 07:46 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీవారం ఈ కామెడీ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఈ షో కి అంత డిమాండ్ ఉంది కాబట్టే.. మొదట్లో ఒకరోజు మాత్రమే ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ ను.. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ పేరుతో మరో రోజుకు పెంచారు. ఇక ఈ షోని టెలికాస్ట్ చేసే ఛానెల్ కూడా.. అదిరిపోయే టి.ఆర్.పి సాధిస్తూ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చింది. అయితే వైరస్ మహమ్మారి వల్ల ఈ ‘జబర్దస్త్’ షూటింగ్ రెండు నెలల పైనే ఆగిపోయింది.

అయితే ఐదవ విడత లాక్ డౌన్ లో కొన్ని పరిశ్రమలకు మినహాయింపులు ఇస్తుండడంతో.. సినీ ఇండస్ట్రీని కూడా దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ రెండు నెలలు షూటింగ్ ఆగిపోవడం వల్ల ‘జబర్దస్త్’ ను టెలికాస్ట్ చేసే ఛానల్ టాప్ ప్లేస్ ను కోల్పోయిందనే చెప్పాలి. పాత ఎపిసోడ్ లను టెలికాస్ట్ చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక తాజాగా షూటింగ్ లకు పర్మిషన్ లు లభించడంతో ‘జబర్దస్త్’ షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించారు.

తాజాగా జూన్ 25న ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమోని కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోని బట్టి చూస్తే.. జిగేల్‌ జీవన్‌, మస్తీ మహీదర్‌, ఫసక్‌ శశి, శాంతికుమార్‌ల టీమ్ లు మిస్ అయినట్టు తెలుస్తుంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగానే ఈ టీం లను తొలగించారని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే తాగుబోతు రమేష్ కూడా ఈ షోకు ఎంట్రీ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus