Star Heroes: హీరోలను చిక్కుల్లో పడేసిన ‘మైత్రి’ సంస్థ.. ఏమైందంటే..!

  • April 24, 2023 / 05:09 PM IST

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ టాలీవుడ్లో లీడింగ్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థలో రూపొందే సినిమాలు మినిమమ్ గ్యారంటీ అని అంతా భావిస్తారు. అందుకు తగ్గ ట్రాక్ రికార్డు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ చిక్కుల్లో పడింది. అలాగే స్టార్ హీరోలను సైతం చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తుంది. విషయం ఏంటి అంటే గత 4,5 రోజులుగా మైత్రి ఆఫీస్ ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

మొన్నటికి మొన్న సుకుమార్ ఆఫీస్ లో కూడా ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ‘మైత్రి’ వారితో సుకుమార్ కు చాలా డీలింగ్స్ ఉన్నాయి. ‘ఉప్పెన’ అనే మీడియం బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ లాభాలు వచ్చాయి. దీంతో ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ తో ‘మైత్రి’ సంస్థ మరిన్ని మిడ్ రేంజ్ సినిమాలు నిర్మించాలని భావిస్తుంది.

అందుకే సుకుమార్ తో ఏకమైంది. ఇదే కారణంతో ‘సుకుమార్’ ఆఫీస్ పై రైడ్ చేసిన అనంతరం ఐటీ అధికారులు ఇప్పుడు మైత్రి ఆఫీస్ ల పై పడ్డారు. గత 5 రోజుల నుండి ‘మైత్రి’ సంస్థ పై ఐటీ అధికారులు నాన్ స్టాప్ గా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారికి స్టార్ హీరోలతో చేసిన ‘వాట్సాప్ చాట్’ వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది.

(Star Heroes) ఇందులో వారి పారితోషికాలు, అడ్వాన్స్ ల గురించి పూర్తి వివరాలు లభించాయని తెలుస్తుంది. ఓ రాకగంగా ఇప్పుడు వారి వల్ల టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. విదేశీయుల పెట్టుబడిని.. ‘మైత్రి’ సంస్థ లెక్కలనేవి లేకుండా సినిమాలకు భారీ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం అందడంతో.. ఐటీ అధికారులు ఇలా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus