సెకండాఫ్ లో రిలీజ్ కానున్న స్టార్స్ సినిమాలు!

  • May 27, 2017 / 11:41 AM IST

స్టార్‌ హీరోలు సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతుంటారు. ఆ సమయాల్లోనే వసూళ్లు ఎక్కువగా వస్తాయని వారి ఆలోచన. అందుకే సంక్రాంతి, వేసవి సీజన్లలోనే ఎక్కువగా స్టార్‌ సినిమాలు విడుదలవుతుంటాయి. మిగిలిన సినిమాలు దసరా, క్రిస్‌మస్‌ సమయాల్లో వస్తుంటాయి. ఏడాది ప్రథమార్ధంలో కనిపించినంత సందడి ద్వితీయార్ధంలో ఉండదు. ఈసారి మాత్రం సెకండాఫ్ లో స్టార్ల సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.  సాధారణంగా జూన్‌ తర్వాత పాఠశాలలు, కళాశాలలు తెరుస్తారు కాబట్టి కొత్త సినిమాల సందడి దాదాపుగా తగ్గిపోయేది. కానీ ఈసారి జూన్‌ నుంచే సందడి ఎక్కువగా కనిపించబోతోంది. ‘డీజే’ తర్వాత, మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘స్పైడర్‌’, సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం, ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్‌’, గోపీచంద్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’, ‘గౌతమ్‌నంద’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

‘ఒక్కడు మిగిలాడు’తో మంచు మనోజ్‌, ‘నక్షత్రం’తో సాయిధరమ్‌ తేజ్‌ కూడా త్వరలోనే సందడి చేయబోతున్నారు. ఫస్టాఫ్ లో సందడి చేసిన స్టార్‌ హీరోలు సెకండాఫ్ లోను మెప్పించనున్నారు.   ‘కాటమరాయుడు’తో అలరించిన పవన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా సంక్రాంతికి సందడి చేసిన బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 29న విడుదల కానుంది. ‘ఓం నమో వేంకటేశాయ’తో వచ్చిన నాగార్జున ప్రస్తుతం ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది2’ చేస్తున్నారు. ఆ చిత్రం జులైలోనే థియేటర్లోకి రానుంది. ఇలా స్టార్ హీరోలు ఏడాది మొత్తం అభిమానులకు ఆనందాన్ని పంచేందుకు శ్రమిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus