7 ఏళ్ళ ‘ఎవడు’.. గురించి మనకి తెలియని సీక్రెట్ ఇదే..!

  • January 12, 2021 / 06:42 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు’.సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2014 జనవరి 12న విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 7ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇదిలా ఉండగా..శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్, అమీ జాక్సన్ వంటి వారు స్పెషల్ రోల్స్ ప్లే చేశారు. రాంచరణ్ కెరీర్ లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఎవడు’ సూపర్ హిట్ గా నిలిచింది. పోటీగా మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం ఉన్నప్పటికీ ‘ఎవడు’ చిత్రం అసాధారణ విజయాన్ని నమోదు చేసింది.

హాలీవుడ్ మూవీ ‘ఫేస్/ఆఫ్’ ఇన్స్పిరేషన్ తో ‘ఎవడు’ ని రూపొందించాడు వంశీ పైడిపల్లి. ఇదిలా ఉండగా.. ‘ఎవడు’ గురించి మనకు తెలియని ఓ సీక్రెట్ ఉంది. అదేంటంటే ఈ చిత్రాన్ని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు వంశీ పైడిపల్లి ‘ఎవడు’ కథని మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఒకేసారి వినిపించాడట. వాళ్ళిద్దరికీ కథ నచ్చింది. కానీ ఆ టైములో వాళ్లిద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దాంతో దర్శకుడు వంశీ పైడిపల్లి.. దిల్ రాజుని కలిశాడట. మన రాజు గారి దగ్గర అప్పటికి మహేష్ బాబు డేట్స్ ఉన్నాయి. దాంతో మహేష్ బాబుకి వంశీ తెచ్చిన కథ వినమని రిఫర్ చేసాడట దిల్ రాజు.

మహేష్ బాబు కూడా ఈ కథ విన్నాడు. వంశీ పైడిపల్లి స్టోరీ నెరేట్ చేసిన విధానం మహేష్ కు నచ్చింది. కానీ ఈ కథలో కొంచెం రిస్క్ ఉంది. ఫేస్ మార్ఫింగ్ కథ కాబట్టి.. అటు వైపు కూడా సేమ్ కటౌట్ ఉన్న హీరో కావాలి. ‘వేరే కథ ఉంటే చేద్దాంలే’ అని మహేష్ లైట్ తీసుకున్నాడట. చివరికి ఇది అల్లు అరవింద్ గారి వద్దకు వెళ్లడం. ఆయన చరణ్,బన్నీ లతో చేస్తే బాగుంటుంది అని నిర్మాత దిల్ రాజుకి సూచించడంతో ఆ ప్రాజెక్టు అలా సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus