ప్రభాస్ సాహోలో స్టైలిష్ విలన్

  • May 6, 2017 / 05:44 AM IST

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సాహో మూవీ పనుల్లో వేగం పుంజుకుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 28 న రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలో విలన్ ఫిక్స్ అయ్యారు. ధృవ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అరవింద్ స్వామి ఈ సారి ప్రభాస్ తో తలపడనున్నారు. అతనికి తెలుగు, తమిళం, హిందీలో అభిమానులున్నారు. అందుకే అతను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నిర్మాతలు వెనుకడుగు వేయకుండా ఖరారు చేసినట్లు సమాచారం.

ఇందులో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందనా నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. త్వరలో హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన రానుంది. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ కి  జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus