సుకుమార్ కి భారీ పారితోషికం!

  • January 22, 2021 / 07:35 PM IST

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారెడుపల్లి అడవులలో శరవేగంగా జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని రూపొందించడానికి దర్శకుడు సుకుమార్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా సుకుమార్ ఏరియా హక్కులు తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుక్కు కోసం ఓ నెంబర్ ఫిక్స్ అయిందని సమాచారం.

మొత్తంగా ఈ సినిమా కోసం సుకుమార్ కి రూ.23 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. గతంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా సమాయంలోనే సుకుమార్ తదుపరి సినిమాను తమ బ్యానర్ లో నిర్మించి ఇంతమొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అదే మాట మీద ఇప్పుడు ‘పుష్ప’ సినిమా కోసం ఇంత భారీ మొత్తాన్ని సుకుమార్ కి ఇస్తున్నారట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక నటిస్తోంది.

ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus