సునీల్ దర్శకత్వంలో సినిమా..?

  • December 3, 2020 / 12:48 PM IST

దర్శకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటులుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అల్లరి నరేష్, హీరో నాని, రాజ్ తరుణ్ లాంటి వాళ్లని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ వీరందరికి ఎప్పటికైనా మెగాఫోన్ పెట్టాలనే ఆశ మాత్రం ఉంది. అయితే వీరందరి కంటే ముందు కమెడియన్ సునీల్ దర్శకుడు అయిపోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సునీల్ కి ఎప్పటినుండో మెగాఫోన్ పై గురి ఉంది. తన సినిమాలకు కొత్త దర్శకులను ఎన్నుకునేది కూడా తన దర్శకత్వ ప్రతిభ చూపించుకునే ఛాన్స్ వస్తుందనే.

ఫైనల్ గా సునీల్ తన కల నెరవేర్చుకోబోతున్నాడని సమాచారం. ఓ మరాఠీ సినిమా హక్కులను సునీల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే సునీల్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ సినిమాలో హీరో కూడా అతడే. సునీల్ కి ఓ నిర్మాత కూడా దొరికేశాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడట దీనికోసం రైటింగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాడట సునీల్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. కానీ సరైన విజయాలు రాకపోవడంతో హీరోగా అతడికి అవకాశాలు తగ్గాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సునీల్ ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే హీరోగా వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సలోనీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus