Surender Reddy: ఆ ఫ్లాప్స్ పై సురేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

  • February 1, 2022 / 11:32 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను స్టైలిష్ గా తెరకెక్కించే డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే. ధృవ, సైరా నరసింహారెడ్డి సినిమాలతో సురేందర్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ హీరోగా ఏజెంట్ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలలో అశోక్ సినిమా ఫ్లాప్ అయితే ఊసరవెల్లి సినిమా యావరేజ్ గా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండుసార్లు అవకాశం ఇచ్చినా సురేందర్ రెడ్డి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరోవైపు మహేష్ బాబు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అతిథి అనే సినిమా తెరకెక్కింది. అయితే అతిథి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అతిథి సినిమా మహేష్ బాబు అభిమానులను సైతం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అతిథి సినిమా తర్వాత మహేష్ బాబు సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకుని ఖలేజా సినిమాలో నటించడం జరిగింది. సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డిజాస్టర్లను తెరకెక్కించలేదని తన సక్సెస్ రేట్ 70 శాతం అని తెలిపారు. నేను కష్టాన్ని, టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చానని సురేందర్ రెడ్డి అన్నారు. తొలి సినిమా అతనొక్కడే సక్సెస్ అయిన సమయంలో చాలా సంతోషించానని సురేందర్ రెడ్డి అన్నారు.

అతిథి సినిమా ఫ్లాప్ అయిన సమయంలో చాలా బాధ పడ్డానని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కిక్2 సినిమాకు టైటిల్ విషయంలో తప్పు చేశానని ఆయన అన్నారు. కిక్2 ఫెయిల్యూర్ బాధ పెట్టిందని ఆయన తెలిపారు. సినిమా బాగుండి బాధ పడిన సినిమా ఊసరవెల్లి అని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఊసరవెల్లి బెస్ట్ స్క్రిప్ట్ అని సురేందర్ రెడ్డి అన్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus