టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లేటెస్ట్ బిజినెస్ డీటెయిల్స్

  • June 21, 2018 / 01:11 PM IST

ఇండస్ట్రీకి సంబంధించి నాలుగు స్తంభాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి సురేష్ బాబు. సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాక ఇండస్ట్రీ పెద్దల్లోనూ ఒకరైన సురేష్ బాబు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, స్టూడియో అధినేతగా ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన సరికొత్త బిజినెస్ మొదలెట్టారు. ఆదేటంటే.. పాల వ్యాపారం. పాల వ్యాపారమే కదా చీప్ గా చూడకండి. ఆర్గానిక్ మిల్క్ ఇప్పుడు అత్యంత శ్రేష్టమైన మరియు లాభకరమైన వ్యాపారం.

అయితే.. సురేష్ బాబు ఇదేదో లాభాల కోసం పెట్టలేదు. ప్యాకెట్ పాలు, కల్తీ పాలు తాగి తన మరియు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవ్వడంతో తన కుటుంబంతోపాటు అందరికీ ఆరోగ్యకరమైన పాలు అందించాలనే ఆలోచనతో ఈ బిజినెస్ మొదలెట్టారు సురేష్ బాబు. ఇకపోతే.. ఆయన నిర్మించిన తాజా చిత్రం “ఈ నగరానికి ఏమైంది?” ఈ నెల 29న విడుదలకానుంది. “పెళ్ళిచూపులు” ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే సురేష్ ప్రొడక్షన్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus