అలా అయితే మొదటి రోజే 150 కోట్లు వచ్చేస్తాయి..!

  • September 8, 2019 / 04:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి చేసే విన్యాసాలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితా బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, అనుష్క, ప్రగ్య జైస్వాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అద్బుతమైన స్పందన లభించింది. త్వరలో ‘సైరా’ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారట. తెలుగుతో పాటు తమిళ,కన్నడ, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట. ఇప్పటీకే ట్రైలర్ కు సంబంధించి ఫైనల్ కట్ ను రెడీ చేసాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. చిత్ర యూనిట్ సభ్యుల నుండీ అందుతున్న సమాచారం ప్రకారం… టీజర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలనే చూపించారు కాబట్టి ట్రైలర్ లో మాత్రం అద్భుతమైన డైలాగ్స్, కథ గురించి ప్రేక్షుకులకు ఓ అవగాహన అలాగే అదిరిపోయే విజువల్స్ తో ట్రైలర్ ఉండబోతుందట. నరసింహారెడ్డి పోరాటం బ్రిటిష్ వారితో ఎలా సాగిందనే విషయాన్ని కూడా ట్రైలర్ లో శాంపిల్ గా చూపించబోతున్నారట. మొదటి రోజే 150 కోట్ల గ్రాస్ వచ్చేలా ట్రైలర్ ను కట్ చేశారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెండు రోజుల ముందు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus