రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతున్న ‘సైరా’ టీమ్

  • February 17, 2018 / 07:28 AM IST

ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొననుంది. ఈ సినిమాలో వీరిద్దరూ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో కనిపించనున్నారు.

ఈ సీన్లు చాలా కీలకమని చిత్ర బృందం తెలిపింది. 23 నుంచి ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో నయన, చిరు తోపాటు అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతిబాబు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఎక్కువమంది స్టార్స్ కాంబినేషన్ కాబట్టి నాన్ స్టాప్ గా ఈ సీన్లు కంప్లీట్ చేయడానికి డైరక్టర్ పక్కా ప్లాన్ వేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకునిగా ఇళయరాజాని సంప్రదించారు. మ్యాస్ట్రో సమాధానం కోసం మెగాస్టార్ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus