మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), రాంచరణ్(Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ తర్వాత సీనియర్ స్టార్ హీరోయిన్లకి కూడా జోడీగా నటించింది. చిరంజీవి (Chiranjeevi) , వెంకటేష్ (Venkatesh ) వంటి సీనియర్లతో తమన్నా (Tamannaah Bhatia) జోడీ కట్టింది. ఇప్పుడు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే ఒకప్పటితో పోలిస్తే తమన్నా.. డిమాండ్ ఇప్పుడు తగ్గింది.
పారితోషికం విషయంలో కూడా అంతే..! గతంలో తమన్నా ఎంత డిమాండ్ చేసినా.. కాదనకుండా ఇచ్చేసేవారు నిర్మాతలు. కానీ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేయడంతో తమన్నా ఓటీటీల వైపు వెళ్ళింది. అక్కడ విచ్చల విడిగా అందాలు ఆరబోసింది. బెడ్రూమ్ సీన్స్ వాటిలో రెచ్చిపోయింది. దీంతో ఓటీటీ సిరీస్..లకు సంబంధించి మళ్ళీ తమన్నా, భారీ పారితోషికాలు అందుకునే రేంజ్ కి వెళ్ళింది. కొందరు నిర్మాతలు తమన్నాని మెయిన్ లీడ్ గా పెట్టి సిరీస్ లేదా సినిమా తీస్తే..
వాటికి ఓటీటీల నుండి మంచి రేట్లు వస్తున్నాయి. అందువల్ల తమన్నా రూ.3 కోట్లు డిమాండ్ చేసినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఆమె ఓ సోప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించింది. దీని మొత్తం కాంట్రాక్టు కింద తమన్నాకి రూ.6.2 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చారట. 3, 4 ఏళ్ళ పాటు తమన్నా ఈ సోప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.