విలన్, వదిన పాత్రలకు రెడీ అంటోన్న బ్యూటీ!

  • December 30, 2020 / 01:16 PM IST

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా ఇప్పుడు బెంగాలీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. కంటెంట్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా ఎత్తులో ఉందంటోంది ఈ బ్యూటీ. తనకు స్టార్ డమ్ వచ్చింది తెలుగు సినిమాలతోనే అని ప్రకటించుకుంది. మంచి రోల్స్ వస్తే టాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.

కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కంటెంట్ బాగుంటే విలన్, వదిన పాత్రలు చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ క్రమంలో బాలయ్యతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడింది. బాలయ్యతో ఏ హీరోయిన్ పని చేసినా.. బరువు పెరగడం ఖాయమని అంటోంది. పదిహేనేళ్ల క్రితం బాలకృష్ణతో కలిసి ‘వీరభద్ర’ అనే సినిమా చేసింది తనుశ్రీ. ఆ సినిమా సమయంలో బాలయ్యతో పాటు చిత్రయూనిట్ మొత్తం తనను బాగా చూసుకుందని.. ఆ సమయంలో ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసినట్లు చెప్పుకొచ్చింది.

అలా షూటింగ్ పూర్తయ్యే సరికి 5 కిలోల బరువు పెరిగానని తెలిపింది. పెరిగిన బరువును తల్లితండ్రులకు చూపిస్తూ.. టాలీవుడ్ లో ప్రేమ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పిందట. ఇలా టాలీవుడ్ ని, తెలుగు హీరోలని తెగ కాకాపడుతుంది ఈ బ్యూటీ. ఎంత పొగిడినా.. అమ్మడుకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరనిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని కెలికేసిన ఈ భామకి తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశించడం భ్రమే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus