తారక్ వద్దకు చేరిన జన గణ మన స్టోరీ

  • October 21, 2016 / 07:37 AM IST

టాలీవుడ్ లో డేరింగ్, డ్యాషింగ్ డైరక్టర్ ఎవరని అడిగితే గుర్తుకు వచ్చే పేరు పూరి జగన్నాథ్. ఆయన చిత్రాల్లో హీరోలు ఉన్నట్లే, నిజజీవితంలో పూరి అలా ఉంటారు. తాను రాసుకున్న కథను నమ్ముతారు. మరొకరికి నచ్చలేదని పక్కన పడేయరు. ఆ కథ నచ్చిన హీరోతోనే సినిమా తీసి హిట్ కొడుతారు. అలా చేసి విజయవంతమైన సినిమాల్లో ఇడియట్, పోకిరి ఉన్నాయి. పోకిరి కథని మొదట పవన్ కళ్యాణ్ కి చెప్పారు. ఆయన అందుకు కనెక్ట్ కాలేదు. మహేష్ బాబు కి బాగా నచ్చింది. సో అతనితో చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు అలా ఆయన రాసిన మరో కథ హీరోని మార్చుకోబోతోంది.

సమాజంలో క్రమ శిక్షణ లేదనే బాధతో “జనగణమన” అనే కథను పూరి రాసుకున్నారు. మహేష్ బాబుకి చెప్పారు. అతనికి స్టోరీ బాగా నచ్చింది. అయితే సినిమా చేద్దామా? వద్దా ? అనే విషయం పై ప్రిన్స్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వినిపించారు. మెసేజ్ తో కూడిన ఈ యాక్షన్ ఈ స్టోరీ ని చేసేందుకు తారక్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ హీరో గా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించనున్న సినిమా కథ అదేనని, టైటల్ మాత్రమే మారుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus