సాయిధరమ్ తేజ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!

  • June 12, 2018 / 06:23 AM IST

పాపం వరుస పరాజయాలతో ఢీలాపడిన సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రమైన “తేజ్ ఐ లవ్ యూ”పై బోలెడు ఆశలు పెట్టుకొన్నాడు. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరీ సూపర్ హిట్ అవ్వకపోయినా తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేస్తే చాలు అనుకొన్నాడు సాయి. కుదిరినంత త్వరగా ఆ సినిమా పూర్తి చేసి అనంతరం తన భవిష్యత్ ప్రొజెక్ట్స్ ను మొదలెడదాం అనుకొన్నాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఘనంగానే జరిగింది.

అయితే.. ఈ సినిమాను ముందు అనుకొన్నట్లుగా జూన్ 29న విడుదల చేయడం కుదరట్లేదట. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ చిత్రాన్ని జూలై 6కి పోస్ట్ పోన్ చేశారని సమాచారం. ఈ సినిమా ఉన్నట్లుండి పోస్ట్ పోన్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ కాస్త ఢీలాపడ్డాడు. అయితే.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని సాయిధరమ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. మరి మనోడి ఆశలు ఏమేరకు ఫలిస్తాయో తెలియాలంటే జూలై 6 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus