దేవికి.. తమన్ డామినేషన్ ఎక్కువైపోయిందా, అల్లు అర్జున్ -కొరటాల సినిమాకి కూడా..?

  • September 1, 2020 / 09:34 PM IST

3 ఏళ్ళ క్రితం వరకూ దేవి శ్రీ ప్రసాద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగేవాడు. ఆ టైములో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేసేవారు. కానీ 2018 లో వచ్చిన వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ చిత్రం తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అప్పటి నుండీ దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇవ్వలేకపొతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక్క ‘రంగస్థలం’ ‘చిత్రలహరి’ సినిమాలు తప్ప దేవి శ్రీ పనిచేసిన సినిమాల్లోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోపక్క అదే సమయం నుండీ తమన్ పుంజుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలను బట్టి ఇప్పుడు పెద్ద సినిమాలకు అందరూ తమన్ నే కావాలంటున్నారని వినికిడి.

ఈ నేపథ్యంలో చాలా వరకూ పెద్ద ప్రాజెక్టుల నుండీ దేవి శ్రీ కి బదులుగా తమన్ ను తీసుకున్నారని కూడా టాక్. మహేష్ బాబు కూడా తన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి తమన్ ను ఏరి కోరి తీసుకున్నాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ చేతిలో కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ వంటి బడా ప్రాజెక్టు ఉంది.ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోవాలా లేక తమన్ ను తీసుకోవాలా అనే డిస్కషన్లు జరుగుతున్నాయట. తమన్ అయితే.. బన్నీ ‘డబుల్ ఓకే’ అంటున్నాడట.

కానీ కొరటాలకు దేవి శ్రీ మంచి సన్నిహితుడు. చిరు ప్రెజర్ వల్ల ‘ఆచార్య’ కు మణిశర్మను తీసుకున్నాడే తప్ప.. అతనికి దేవినే తీసుకోవాలని ఉన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాకి కొరటాల వీరిద్దరిలో ఎవరిని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ‘పుష్ప’ సినిమాకి దేవి మంచి మ్యూజిక్ ఇచ్చి బన్నీని మెప్పిస్తే.. దేవి నే ఫిక్సయ్యే ఛాన్స్ కూడా ఉంది.మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus