రాజకీయానికి ఏమాత్రం సంభందం లేదు.!

  • January 13, 2017 / 06:48 PM IST

టాలీవుడ్ ప్రభంజానికి నిన్ననే ముహూర్తం ఫిక్స్ చేశారు…..మనం మరచిపోయిన కధని, మనకు తెలిపే విధంగా, మనకి గుర్తు చేసే విధానంలో క్రిష్ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనూహ్య స్పందన, ఎవ్వరూ ఊహించని రెస్పాన్స్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్, ఇండస్ట్రీ బ్లాక్ బష్టర్ హిట్….ఇలా ఒక్కటెంటి నిన్న గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా  ఉంటే వరుసగా తారలు, పరిశ్రమ వారందరూ ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక అదే క్రమంలో నిన్న నగరంలోని ట్రెండ్‌సెట్‌ థియేటర్‌లో బాలకృష్ణ, నటి శ్రియ, దర్శకుడు క్రిష్‌ తిలకించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఊహించిన దానికంటే భారీ విజయం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక అదే క్రమంలో ఒక డైలాగ్ కాంట్రొవర్సీ పై కూడా ఆయన స్పందించారు..దేశం మీసం తిప్పుదాం’ అనే డైలాగ్ కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, అది సినిమాలో సంధర్భాన్ని బట్టి మాత్రమే వస్తుంది అని దాన్ని రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదు అని తెలిపారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ థియేటర్ లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చూసిన అనంతరం బాలయ్య మాట్లాడుతూ, తాము ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిందని, తమ చిత్రానికి విదేశాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల సీఎంలకు బాలకృష్ణ తన కృతఙ్ఞతలు తెలిపారు. మొత్తానికి క్రిష్ సామాన్యుడు కాదు, అనుకున్నది అనుకున్నట్లు అతి తక్కువ సమయంలో సాధించడం నిజంగా శుభపరిణామం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus