బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ ఆర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మరణించారు. ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో విద్యాబాలన్ తో కలిసి నటించిన ఆమె కోల్కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. నిన్న ఆమె ఇంటి పని మనిషి వచ్చి తలుపులు కొట్టగా ఆర్య బెనర్జీ ఎంతసేపటికీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడకి చేరుకున్న కోల్కతా పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లి చూడగా.. బెనర్జీ బెడ్ పై అపస్మారక స్థాయిలో పడి ఉన్నారు.
ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో పాటు ముక్కులో నుండి రక్తం కారుతూ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్య బెనర్జీ కొంతకాలంగా కోల్కతాలో ఒంటరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు వెల్లడించింది. దీంతో పనిమనిషి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆర్య బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆమె మరణ వార్త తెలిసి బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ బెంగాలీ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!