బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ (Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న అనగా.. జూన్ 12న ఇంగ్లాండ్ లో ఉన్న ఆయన నివాసంలో పోలో ఆడుతున్న టైంలో హార్ట్ ఎటాక్ కి గురవ్వడంతో అతను.. అక్కడికక్కడే కన్నుమూశాడు. 53 ఏళ్ల వయసుకే అతను ఇలా మరణించడం అనేది అతని ఫ్యామిలీ పెద్ద షాకిచ్చినట్టు అయ్యింది. సంజయ్ కపూర్ (Sanjay Kapoor) తో కరిష్మా కపూర్ (Karisma Kapoor) .. 2016 లోనే విడాకులు తీసుకుంది.
వీరి వివాహం 2003లో జరిగింది. కరిష్మా కంటే ముందు నందితా మహంతిని వివాహం చేసుకున్నాడు సంజయ్. ఆమెతో విడిపోయాక కరిష్మా కపూర్ (Karisma Kapoor) ని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు కూడా. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందువల్ల 2016లో విడిపోవాలని నిశ్చయించుకున్నారు.
కరిష్మాతో విడిపోయిన అనంతరం సంజయ్ మాజీ మోడల్ ప్రియా సచ్ దేవ్ ను ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఓ బాబు ఉన్నాడు.సంజయ్ కపూర్ (Sanjay Kapoor) ప్రపంచంలోనే పెద్ద బిజినెస్మెన్లలో ఒకడు. అతను 1.2 బిలియన్ డాలర్లకు అధిపతి. ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలి అంటే రూ.10,300 అనమాట. 6 నెలల క్రితం అతని కంపెనీ వాల్యూ రూ.40,000 వేల కోట్లు అంటూ ప్రచారం జరిగింది.
సంజయ్ తో విడిపోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఆ రూ.40,000 కోట్ల ఆస్తి కరిష్మా కపూర్ కి సొంతం అయ్యుండేది. ఇప్పుడు ఆమెకు ఆ అవకాశం లేదు. కానీ ఆమె పిల్లలకు కొంత వాటా అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఎంత అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం.