ఎగ్జిబిటర్ల డిమాండ్లకు తలొగ్గుతారా..?

  • February 4, 2021 / 05:35 PM IST

లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తీర్చుకొని సరిగ్గా యాభై రోజులు అవుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో మరోసారి థియేటర్లు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదమే. మల్టీప్లెక్స్ లకు ఉండే హక్కులను సింగిల్ స్క్రీన్ లకు కూడా వర్తింపజేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ ల మాదిరే పర్సంటేజ్‌ సిస్టంను సింగిల్ స్క్రీన్ ల విషయంలో అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు.

అంతేకాకుండా.. పెద్ద సినిమాలు విడుదలను ఆరు వారాల తరువాత, అలానే చిన్న సినిమాలు విడుదలైన నాలుగు వారాల తరువాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను గనుక అంగీకరించకపోతే మార్చి 1నుండి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య చర్చలు జరిగాయి.

ఈ మీటింగ్ లో సురేష్ బాబుతో పాటు డీవీవీ దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లలో సందడి మొదలైంది. పైగా ఇప్పటినుండి వరుసగా థియేటర్లలో సినిమాలు రాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు తలొగ్గుతారేమో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus