‘డియర్ కామ్రేడ్’ కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం

  • August 18, 2018 / 08:01 AM IST

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం సినిమా సంచలన విజయం సాధించింది. అర్జున్ రెడ్డి క్యారెక్టెర్ కి పూర్తిగా భిన్నమైన గోవిందం క్యారెక్టర్లో విజయ్ మెప్పించారు. అతని పక్కన నటించిన రష్మిక మందన అయితే పెర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. అందుకే వీరిద్దరూ చేయనున్న నెక్స్ట్ ప్రాజక్ట్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న

సినిమాలో కూడా రష్మిక.. విజయ్ కి జోడీగా కనిపించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ చూసి చాలామంది.. ఇది విప్లవ సినిమాగా అనుకున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఇది కాలేజీ నేపథ్యంలో సాగుతుందని టాక్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్ బాల్ మ్యాచ్ సమయంలో జరిగే గొడవ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సీన్ సినిమాలో పది నిముషాలు మాత్రమే ఉంటుంది. ఇక “డియర్ కామ్రేడ్” అయితే క్రికెట్ మ్యాచ్ చుట్టూ తిరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus