బెదిరింపు ఫోన్ కాల్… పోలీసులకు జగపతిబాబు బ్రదర్ కంప్లయింట్

  • October 9, 2020 / 11:05 AM IST

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఏ ఏరియాకి వెళ్లినా భూముల రేట్లు కోట్లలో ఉన్నాయి. గజం లక్షకు పైగా పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. అందుకని, ఖాళీగా ఉన్న స్థలాలపై కబ్జాదారుల కన్ను పడుతోంది. అయ్యప్ప సోసిటీ 100 ఫీట్ రోడ్ ప్రారంభమయ్యే దగ్గర గుట్టల బేగంపేట ఏరియాలో ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు కుటుంబానికి స్థలాలు ఉన్నాయి. గుట్టల బేగంపేటలో ఉన్న స్థలాల వివాదం పరిష్కరించుకోవాలని, లేదంటే చంపేస్తానని ఫోనులో తనను బెదిరించారని జగపతిబాబు సోదరుడు వి. యుగేందర్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.

ఫోన్ నంబర్లు, వాయిస్ రికార్డింగులు పోలీసులకు అందజేశారు. ఫిలింనగర్ లో నివాసం ఉండే ఆయన వ్యాపారి. ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని చెప్పినట్టు యుగేందర్ కుమార్ తెలియజేశారు. తనకు పాతికసార్లు బెందరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలనీకి చెందిన సి. రాజిరెడ్డి మీద తనకు అనుమానం ఉందన్నారు యుగేందర్. కొన్నాళ్ల నుండి జగపతిబాబు ఫ్యామిలీకి చెందిన స్థలాలు వివాదంలో ఉన్నాయి. కబ్జాదారులు కన్ను పడటంతో పోలీసులు సహాయంతో తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ వంటిది నిర్మించారు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus