అల్లు అర్జున్, ఎన్టీయార్ తర్వాత చైతూనే!

  • October 7, 2017 / 04:54 PM IST

చేసింది రెండు సినిమాలే అయినా ఎందుకో తెలియదు కానీ భీభత్సమైన క్రేజ్ తోపాటు బోలెడన్ని ఆఫర్లు కూడా సొంతం చేసుకొంది అను ఎమ్మాన్యూల్. ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమాలో నటిస్తూనే అల్లు అర్జున్ సరసన “నా పేరు సూర్య”, త్రివిక్రమ్-ఎన్టీయార్ కాంబో మూవీని బ్యాగ్ చేసుకొన్న అను ఎమ్మాన్యూల్ తాజాగా నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ కథానాయికగా నటించే అవకాశం అందిపుచ్చుకొంది. వరుసబెట్టి ఎన్టీయార్, అల్లు అర్జున్, నాగచైతన్య లాంటి యంగ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకొని లేటెస్ట్ హీరోయిన్స్ అందరికీ గట్టి పోటీనిస్తుంది.

ఇకపోతే.. ఇవాళ “మహానుభావుడు” విడుదలై సూపర్ హిట్ అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మారుతి తాను చైతన్య కథానాయకుడిగా తెరకెక్కించే సినిమా మీడియా ప్రచారం జరుగుతున్నట్లుగా “పెళ్లి తర్వాత కష్టాల” నేపధ్యంలో సినిమా తెరకెక్కట్లేదని, ఇదో యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని వివరించారు మారుతి. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చీనబాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుండి రెగ్యులర్ షూట్ మొదలవ్వనుంది. సమంతను పెళ్లాడిన అనంతరం నాగచైతన్య నటించబోయే సినిమా కావడంతో ఈ చిత్రంలో విశేషమైన ప్రాధాన్యత సంతరించుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus