జోరుగా యాక్షన్ సినిమాల మేకింగ్

  • August 5, 2017 / 01:52 PM IST

పౌరాణిక సినిమాలు.. జానపద కథా చిత్రాలు.. సాంఘిక సినిమాలు.. ఇలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలం ఒక్కో  సీజన్ నడుస్తుంటుంది. ప్రేమ కథలు, ఫ్యాక్షన్ కథలు కూడా కొన్నేళ్లు బాగా నడిచాయి. ప్రస్తుతం వినూత్న కథలతో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో ప్రధానంగా యాక్షన్ ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పైసావసూల్ మూవీ స్టంపర్ తో యాక్షన్ సినిమా అని స్పష్టం చేసింది. మహేష్‌బాబు ‘స్పైడర్‌’ కూడా యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతోనే తెరకెక్కింది. ఇందులో స్పెషన్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని చిత్ర బృందం వెల్లడించింది.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరకెక్కుతోన్న ‘జై లవకుశ’లో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుందని ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పింది. ఈసారి విలన్ గా తారక్ హంగామా చేయనున్నారు.  ప్రేమకథలతో హిట్ అందుకునే నితిన్‌ ‘లై’ చేశాడు. ఇది యాక్షన్ మూవీనే. ఇవే కాకుండా నాగ చైతన్య ‘యుద్ధం శరణం’, సాయిధరమ్‌ తేజ్‌ ‘జవాన్‌’, రాజశేఖర్‌… ‘గరుడ వేగ’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘జయ జానకి నాయక’ చిత్రాలూ యాక్షన్‌ నింపుకున్నవే. వీటిలో ఏది విజయం సాధిస్తుందో ప్రేక్షకుల చేతిలోనే ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus